తెలంగాణపై కేంద్రం స్పందిచాలి: కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పందిచాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈరోజు ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ కూడా అయిపోయినందున కేంద్రం వెంటనే స్పందించాలన్నారు.






